గుంటూరు రైల్వే డివిజన్‌కు అవార్డుల పంట

ABN , First Publish Date - 2020-12-30T05:25:03+05:30 IST

రైల్వే జీఎం అవార్డులను దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో చీఫ్‌ క్రూ కంట్రోలర్‌ పి.విజయ్‌ సురేష్‌కు ఈ ఏడాది జీఎం అవార్డు లభించింది.

గుంటూరు రైల్వే డివిజన్‌కు అవార్డుల పంట

గుంటూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రైల్వే జీఎం అవార్డులను దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో చీఫ్‌ క్రూ కంట్రోలర్‌ పి.విజయ్‌ సురేష్‌కు ఈ ఏడాది జీఎం అవార్డు లభించింది. ఆయన గతంలో 2013లో సీవోఎం, 2019లో డీఆర్‌ఎం అవార్డులు పొందారు. వ్యక్తిగత ప్రతిభ ప్రదర్శించిన వి.రవికుమార్‌(టెక్నీషియన్‌, ఓహెచ్‌ఈ), ఏఆర్‌కే  మూర్తి(ఎస్‌ఎస్‌ఈ, టీఎం), పి.మల్లేశ్వరి(ఓఎస్‌, సీనియర్‌ డీఎంఈ ఆఫీసు), సీహెచ్‌ రమణమూర్తి(టీఐ, కోచింగ్‌), టి.నాగేంద్ర(పాయింట్స్‌మెన్‌, నంద్యాల), వి.రవివర్మ(ఏసీఎం) అవార్డులకు ఎంపికయ్యారు. ఉత్తమ యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రైన్‌ నిర్వహణకు గుంటూరు, నాందేడ్‌ డివిజన్‌లకు సంయుక్తంగా అవార్డుని ప్రకటించారు. ట్రాక్‌ మెషీన్ల వినియోగం, అర్జీలను త్వరితగతిన పరిష్కారం, లాక్‌డౌన్‌లో సరుకు రవాణా ద్వారా భారీగా ఆదాయం పొందినందుకు కమర్షియల్‌ విభాగాలకు ఎఫీషియన్సీ షీల్డ్‌లు ప్రకటించారు. బుధవారం సాయంత్రం పట్టాభిపురంలోని డీఆర్‌ఎం ఆఫీసుల్లో వర్చువల్‌ విధానంలో ఈ అవార్డులు అందుకోనున్నారు. 

Updated Date - 2020-12-30T05:25:03+05:30 IST