వ్యవసాయ చట్టాలతో సంక్షోభం
ABN , First Publish Date - 2020-12-30T04:50:01+05:30 IST
కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలు సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేలా ఉన్నాయని సంగం డెయిరీ మాజీ చైర్మన్ కిలారి రాజన్బాబు అన్నారు.
గుంటూరు,(తూర్పు), డిసెంబరు 29: కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలు సమాజాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేలా ఉన్నాయని సంగం డెయిరీ మాజీ చైర్మన్ కిలారి రాజన్బాబు అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసనదీక్షలు మంగళవారం ఐదోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులతో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినపుడే సమస్యకు పరిష్కారం రొరుకుతుందని తెలిపారు. దీక్షలలో తూమాటి శివయ్య, కాలువ శ్రీధర్, వేణుగోపాల్, రంగారెడ్డి, బ్రహ్మయ్య, మాచవరపు నాగేశ్వరరావు, ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, బేగం, ఎరుకలమ్మ, మణికంఠేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.