జర్నలిస్టులకు నేడు ఆన్‌లైన్‌లో శిక్షణ

ABN , First Publish Date - 2020-11-22T05:03:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం పాత్రికేయులకు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ తెలిపారు.

జర్నలిస్టులకు నేడు ఆన్‌లైన్‌లో శిక్షణ

గుంటూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం పాత్రికేయులకు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో కార్యక్రమం ప్రారంభమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరితతో పాటు ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్‌, కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ పాల్గొంటారని చెప్పారు.  కేవీ రామిరెడ్డి, డాక్టర్‌ ఎల్‌వీకే రెడ్డి ఉపన్యసిస్తారని చెప్పారు. బుక్‌లెట్స్‌ పీడీఎఫ్‌ మెటీరియల్‌ మెయిల్‌ ఐడీలకు పంపుతామన్నారు. తరగతులకు హాజరైన వారికి అదే రోజు సాయంత్రం ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్‌ని పంపిస్తామని చెప్పారు.  

Updated Date - 2020-11-22T05:03:36+05:30 IST