రొమ్ము కేన్సర్కు అరుదైన శస్త్రచికిత్స
ABN , First Publish Date - 2020-12-17T05:58:05+05:30 IST
ఒమెగా హాస్పిటల్స్లో అరుదైన కేన్సర్ శస్త్రచికిత్స నిర్వహించారు. మహిళ నుంచి ఆరు కిలోల బరువున్న రొమ్ము కేన్సర్ కణితిని (సిస్టో సార్కోమా ఫిలాయిడెన్) తొలగించారు.

ఆరు కిలోల బరువైన కణితి తొలగింపు
గుంటూరు (మెడికల్), డిసెంబరు 16: ఒమెగా హాస్పిటల్స్లో అరుదైన కేన్సర్ శస్త్రచికిత్స నిర్వహించారు. మహిళ నుంచి ఆరు కిలోల బరువున్న రొమ్ము కేన్సర్ కణితిని (సిస్టో సార్కోమా ఫిలాయిడెన్) తొలగించారు. భారీ పరిమాణంలో ఉన్న రొమ్ము కేన్సర్ కణితి తొలగించడం మనరాష్ట్రంలో ఇదే తొలిసారని, దేశంలో ఆరో కేసు మాత్రమే అని శస్త్రచికిత్స నిర్వహించిన చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎంజీ నాగకిషోర్ తెలిపారు. బుధవారం ఒమెగా హాస్పిటల్స్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్కు చెందిన షేక్ నజీమా (33)నాలుగేళ్ల కిందట రొమ్ము కేన్సర్కు గురి కాగా, స్థానికంగా ఆపరేషన్ చేయించుకుంది. కొద్దికాలానికి మరోసారి రొమ్ము కేన్సర్ కణితి ఏర్పడింది. నాలుగేళ్ల వ్యవధిలో కేన్సర్ కణితి భారీసైజుకు పెరిగిపోవడంతో ఆమె కొద్ది దూరం నడిచినా ఆయాసం కలిగేది. ఈ నేపథ్యంలో ఆమె చికిత్స కోసం ఇటీవల గుంటూరులోని ఒమెగా హాస్పిటల్లో చేరారు. వైద్యబృందం పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ జరిపి 27 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ కణితిని తొలగించింది. భవిష్యత్తులో ఆమెకు మళ్లీ కేన్సర్ రాకుండా కీమోథెరపీ, రే డియేషన్ థెరపీ అందిస్తామన్నారు. సమావేశంలో ఆంకాలజిస్టులు డాక్టర్ శ్రీకాంత్ బోగా, డాక్టర్ జాస్తి విజయకృష్ణ, డాక్టర్ ఎన్వీఎస్ ప్రవీణ్, ఎనస్థటిస్ట్ డాక్టర్ శౌరయ్య పాల్గొన్నారు.