దేవాలయం ప్రహరీ కూల్చివేత

ABN , First Publish Date - 2020-12-30T05:29:42+05:30 IST

కోటప్పకొండలో దేవా లయం గోడను అక్రమంగా అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కూల్చివేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

దేవాలయం ప్రహరీ కూల్చివేత
పొక్లెయిన్‌తో గోడను కూల్చివేస్తున్న దృశ్యం

తమకు సంబంధం లేదన్న ఆర్‌అండ్‌బీ అధికారి

అధికార పార్టీ నేతల పనేనిని ఆరోపణలు 


నరసరావుపేట, డిసెంబరు 29: కోటప్పకొండలో దేవా లయం గోడను అక్రమంగా అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కూల్చివేశారని పలువురు ఆరోపిస్తున్నారు. వివ రాలిలా ఉన్నాయి... కోటప్పకొండ దిగువున పురాతనమైన నీ కంఠేశ్వరస్వామి, ప్రసన్న కోటేశ్వరస్వామి, భువనేశ్వరిదేవి అ మ్మవారి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ఆల యాల ప్రహరీని  కొందరు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండానే పొక్లెయినర్‌తో  కూల్చివేశారు. ఈ ప్రాంతంలో రోడ్డువిస్తరణ పనులు చేస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేత జరిగిందా.. అని ఆర్‌అండ్‌బీ డీఈని వివరణ అడ గ్గా తాము చేయలేదని, తమకు సంబంధం లేదని చెప్పారు. అధికార పార్టీ నేతలే దేవాలయం గోడ కూల్చివేశారని ఆ ప్రాంతవాసులు తెలిపారు. ఈ ఘటన భక్తుల మనోభా వాలను దెబ్బ తీసేదిగా ఉంది.  గోడ కూల్చిన వారిపై చర్యలు తీసుకొవాలని ఆలయ ట్రస్టీ డాక్టర్‌ ప్రభుకుమారి కోరారు. 

Updated Date - 2020-12-30T05:29:42+05:30 IST