-
-
Home » Andhra Pradesh » Guntur » nrt
-
ఉరివేసుకుని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-07T05:07:09+05:30 IST
పట్టణంలోని 60 అడుగుల రోడ్డులో ఓ వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందాడు.

నరసరావుపేట లీగల్, డిసెంబరు 6: పట్టణంలోని 60 అడుగుల రోడ్డులో ఓ వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందాడు. మొదటి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోట బాజీ(36) ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తన నివాస గృహంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాదు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.