నవోదయలో ప్రవేశ దరఖాస్తుకు 29 వరకు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-12-16T05:12:07+05:30 IST

మద్దిరాలలోని జవహర్‌ నవోదయ విద్యాలయలో 2021-22 విద్యాసంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 29 వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ ఎన్‌వీడీ విజయకుమారి మంగళవారం తెలిపారు.

నవోదయలో ప్రవేశ దరఖాస్తుకు 29 వరకు గడువు పెంపు

చిలకలూరిపేట, డిసెంబరు 15 : మద్దిరాలలోని జవహర్‌ నవోదయ విద్యాలయలో 2021-22 విద్యాసంవత్సరంలో  6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 29 వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ ఎన్‌వీడీ విజయకుమారి మంగళవారం తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో నవోదయ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 2021 ఏప్రిల్‌ 10న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2020-12-16T05:12:07+05:30 IST