-
-
Home » Andhra Pradesh » Guntur » mp ramireddy meating at gnt council
-
అండర్గ్రౌండ్ పనులు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-12-16T04:18:03+05:30 IST
నగరంలో అసంపూర్తిగా ఉన్న అండర్గ్రౌండ్ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి సూచించారు.

ఎంపీ అయోధ్య రామిరెడ్డి
గుంటూరు(కార్పొరేషన్), డిసెంబరు 15: నగరంలో అసంపూర్తిగా ఉన్న అండర్గ్రౌండ్ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి సూచించారు. యూజీడీ పనుల పురోగతిపై మంగళవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ చల్లా అనురాధ, షాపూర్జి పల్లోంజి కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇదుకోసం యాక్షన్ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్ఈలు శ్రీనివాసరావు, రవికృష్ణరాజు, ఈఈ సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.