మోడల్ సిటీగా తీర్చిదిద్దుదాం
ABN , First Publish Date - 2020-12-06T04:13:40+05:30 IST
గుంటూరు నగరాన్ని రాష్ట్రంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అన్నారు.
ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి
గుంటూరు(కార్పొరేషన్), డిసెంబరు 5: గుంటూరు నగరాన్ని రాష్ట్రంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రజల సహకారం కావాలని పిలుపునిచ్చారు. కమిషనర్ చాంబర్లో శనివారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లలో తయారయ్యే వ్యర్ధాలను తడి పొడి చెత్తలుగా విభజించి సిబ్బందికి అందజేయాలన్నారు. అనంతరం గుంటూరు నగరానికి సంబంధించి మాస్టర్ప్లాన్ను తనిఖీ చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల వివరాలు, వాటిని అభివృద్ధికి అంచనాలను సిద్ధం చేసి అందజేయాలన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్లు టి.వెంకటకృష్ణయ్య, డిశ్రీనివాసరరావు, బి.శ్రీనివాసరావు, ఎస్ఈ రవికృష్ణరాజు, డిప్యూటీ సిటీ ప్లానర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తొలుత నగర కమిషనర్ చల్లా అనురాధ, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మోదుగల వేణుగోపాల్రెడ్డి, కావటి మనోహర్ నాయుడు, షౌకత్, పాదర్తి రమేష్ గాంధీతో కలిసి సంపత్నగర్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బృందావన్ గార్డెన్స్, పాత గుంటూరు పరిధిలో నిర్మాణలు, రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్లను తనిఖీ చేశారు.