పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలన
ABN , First Publish Date - 2020-11-14T04:51:30+05:30 IST
స్థానిక మంగళగిరి మండలం చినకాకానిలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర డైరెక్టర్ దివాన్ మైదీన్ శుక్రవారం పరిశీలించారు.
గుంటూరు(విద్య), నవంబరు 13: స్థానిక మంగళగిరి మండలం చినకాకానిలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర డైరెక్టర్ దివాన్ మైదీన్ శుక్రవారం పరిశీలించారు. విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో డీఈవో ఆర్ఎస్ గంగాభవాని తదితతరులు పాల్గొన్నారు. కొవిడ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు.