పేదరిక నిర్మూలనకు బ్యాంకులు కృషిచేయాలి
ABN , First Publish Date - 2020-12-06T04:36:32+05:30 IST
నగరంలో పేదరిక నిర్మూలనకు బ్యాంకులు కృషిచేయాలని మెప్మా పీడీ డి.బాలయ్య సూచించారు.

మెప్మా పీడీ బాలయ్య
గుంటూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నగరంలో పేదరిక నిర్మూలనకు బ్యాంకులు కృషిచేయాలని మెప్మా పీడీ డి.బాలయ్య సూచించారు. కొత్తపేట ఆంధ్రాబ్యాంక్, పట్నంబజార్ ఇండియన్ బ్యాంక్లలో శనివారం పీఎం స్వనిధి, జగనన్నతోడు పథకాల లబ్ధిదారులకు మేగా గ్రౌండింగ్ మేళా నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ డీజీఎం ఎం.శ్రీనివాసరావు, ఏజీఎం కె.హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.