వీర్ల దేవాలయాన్ని సందర్శించిన డీఎస్పీ

ABN , First Publish Date - 2020-12-15T05:40:49+05:30 IST

వీరారాధన ఉత్సవాల్లో చాపకూడు, కోడిపోరు, కల్లిపాడు రోజుల్లో ఎక్కువ మంది హాజరవుతారు. శాంతిభద్రతల పర్యవేక్షణకై గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్‌, సీఐ ఉమేష్‌కుమార్‌, స్థానిక ఎస్‌ఐ రవికృష్ణతో కలిసి వీర్లదేవాలయ ప్రాంగణంలో కోడిపోరు జరిపే ప్రదేశాన్ని సందర్శించారు.

వీర్ల దేవాలయాన్ని సందర్శించిన డీఎస్పీ
వీర్లదేవాలయ పరిసరాలను పరిశీలిస్తున్న డీఎస్పీ జయరాంప్రసాద్‌

కారంపూడి, డిసెంబరు 14: వీరారాధన ఉత్సవాల్లో చాపకూడు, కోడిపోరు, కల్లిపాడు రోజుల్లో ఎక్కువ మంది హాజరవుతారు. శాంతిభద్రతల పర్యవేక్షణకై గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్‌, సీఐ ఉమేష్‌కుమార్‌, స్థానిక ఎస్‌ఐ రవికృష్ణతో కలిసి వీర్లదేవాలయ ప్రాంగణంలో కోడిపోరు జరిపే ప్రదేశాన్ని సందర్శించారు. చాపకూడు మందిరం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. అనంతరం అంకాళమ్మ, చెన్నకేశవస్వామి దేవాలయాలను సందర్శించారు. ఈ ఉత్సవాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ పాల్గొనాలని సూచించారు. 

Updated Date - 2020-12-15T05:40:49+05:30 IST