మహానుభావుల త్యాగాలతోనే స్వాతంత్య్రం
ABN , First Publish Date - 2020-08-10T10:14:12+05:30 IST
నేడు మనం అనుభవిస్తోన్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఎందరో మహానుభావుల త్యాగఫలం అని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి ..
పావులూరి సత్కార సభలో హోంమంత్రి సుచరిత
గుంటూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): నేడు మనం అనుభవిస్తోన్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఎందరో మహానుభావుల త్యాగఫలం అని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఆదివారం క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుంటూరులోని స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్యకు ప్రభుత్వం తరుపున సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం తమ జీవితాలను జైళ్లలో మగ్గిపోయేలా చేసి మనకు స్వతంత్ర భారతావనిని అందించిన మహనీయులు స్వాతంత్య్ర సమరయోధులని చెప్పారు. కలెక్టర్ ఆనంద్కుమార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్ మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులు, త్యాగమూర్తులను ఈ తరం వారిమైన మనం సత్కరించుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. సత్కారగ్రహిత శివరామకృష్ణయ్య మాట్లాడుతూ రాజకీయాలు ఏమైనప్పటికీ ప్రజాసేవే ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో భాస్కర్రెడ్డి, తూర్పు మండల తహసీల్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.