భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం
ABN , First Publish Date - 2020-12-28T06:11:17+05:30 IST
క్ష్మీపురం పాటిబండ్ల సీతరామయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం జూపిటర్ ప్రసాద్రావు ఆధ్వర్యంలో 12వ లక్ష హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
గుంటూరు (సాంస్కృతికం), డిసెంబరు 27: లక్ష్మీపురం పాటిబండ్ల సీతరామయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం జూపిటర్ ప్రసాద్రావు ఆధ్వర్యంలో 12వ లక్ష హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామికి విశేశాభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. వెయ్యమంది ఏకాసనంపై 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.