గుంటూరులో దారుణం
ABN , First Publish Date - 2020-12-20T15:51:16+05:30 IST
జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

గుంటూరు: జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం బహిర్భుమికి వెళ్లిన కృష్ణమూర్తిపై కొందరు దుండగులు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.