గుంటూరు పోలీసుల అదుపులో స్టేట్ బ్యాంక్ చోరీ నిందితులు

ABN , First Publish Date - 2020-11-27T16:22:36+05:30 IST

ల్లాలో స్టేట్ బ్యాంక్ చోరీ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు పోలీసుల అదుపులో స్టేట్ బ్యాంక్ చోరీ నిందితులు

గుంటూరు: జిల్లాలో స్టేట్ బ్యాంక్ చోరీ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 21న దాచేపల్లి మండలం నడికుడి స్టేట్ బ్యాంకులో రూ.85 లక్షలు దోపిడీకి గురయ్యారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు  మిర్యాలగూడకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లలో దొంగతనాలు చేయటంలో ఇద్దరూ సిద్ధహస్తులని పోలీసులు గుర్తించారు. చోరీ ప్రాంతంలో దొరికిన కాగితం ముక్క ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేపట్టారు.  స్లిప్‌లో ఫోన్ నంబర్‌ను బట్టి చోరీకి పాల్పడిన వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దోచుకున్న సొమ్ములో రూ.45 లక్షలు దాచేపల్లి మండలం సుబ్బమ్మ హోటల్ ఎదురుగా ఉన్న స్మశానంలో వదిలేసి వెళ్లగా... ఒక దొంగ ఇంట్లో రూ.16 లక్షలు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో దొంగ ఇంటి ఎదురుగా ఉన్న రాళ్ల గుట్టలో రూ.15 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 

Updated Date - 2020-11-27T16:22:36+05:30 IST