జీజీహెచ్కు రూ.25 లక్షల కేన్సర్ మందుల విరాళం
ABN , First Publish Date - 2020-12-06T05:35:41+05:30 IST
గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలోని నాట్కో కేన్సర్ సెంటర్లో చికిత్స పొందుతున్న కేన్సర్ రోగులకు అవసరమైన మందులను వైద్యాధికారులకు నాట్కో ఫార్మా అందజేసింది.

గుంటూరు (మెడికల్) డిసెంబర్ 5: గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలోని నాట్కో కేన్సర్ సెంటర్లో చికిత్స పొందుతున్న కేన్సర్ రోగులకు అవసరమైన మందులను వైద్యాధికారులకు నాట్కో ఫార్మా అందజేసింది. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ చేతుల మీదుగా ఈ మందులను నాట్కో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి అందజేశారు. కార్యక్రమంలో కేన్సర్ వైద్య విభాగాధిపతి డాక్టర్ దుర్గాప్రసాద్, విశ్రాంత ఈఈ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.