అమరావతి ఉద్యమానికి రూ.10లక్షల విరాళం
ABN , First Publish Date - 2020-11-25T04:52:16+05:30 IST
అమరావతి ఉద్యమానికి ఎన్నారై సంఘాలు అండగా నిలిచాయి. రైతులకు మద్దతు నిచ్చేందుకు ఎన్నారై ఫర్ అమరావతి అనే సంస్థను ఏర్పాటు చేశాయి.
గుంటూరు, నవంబరు 24: అమరావతి ఉద్యమానికి ఎన్నారై సంఘాలు అండగా నిలిచాయి. రైతులకు మద్దతు నిచ్చేందుకు ఎన్నారై ఫర్ అమరావతి అనే సంస్థను ఏర్పాటు చేశాయి. ఒక రాష్ట్రం ఒక రాజధాని అనే నినాదంతో ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నారై ఫర్ అమరావతికి ప్రముఖ ఎన్నారై డాక్టర్ బాబురావు దొడ్డపనేని రూ.10 లక్షల విరాళం అందించారు. తమకు బాసటగా నిలిచిన బాబురావుకు అమరావతి రైతులు ధన్యవాదాలు తెలిపారు.