సమాధుల స్థలం కేటాయించాలి

ABN , First Publish Date - 2020-12-20T04:58:40+05:30 IST

నగరంలో క్రైస్తవ సమాఽఽఽధుల స్థలం కేటాయింపునకు సత్వరమే చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు శనివారం కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

సమాధుల స్థలం కేటాయించాలి
కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ను కలిసిన క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధులు

కలెక్టర్‌కు క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ సొసైటీ విజ్ఞప్తి

గుంటూరు, డిసెంబరు 19: నగరంలో క్రైస్తవ సమాఽఽఽధుల స్థలం కేటాయింపునకు సత్వరమే చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్‌ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు శనివారం కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్‌ నాయకులు ఈరి రాజశేఖర్‌, మేడిద బాబురావు మాట్లాడుతూ నగరంలో మూడు లక్షలకు పైగా జనాభా కలిగిన దళిత, క్రైస్తవుల కోసం సమాధుల స్థలం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో పాస్టర్లు బి.రవీంద్రబాబు, పిల్లి ఆంథోని, గాబ్రియేల్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-20T04:58:40+05:30 IST