ఉరివేసుకుని యువకుని ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-30T04:44:30+05:30 IST
తాడేపల్లి పట్టణ పరిధిలోని కేఎల్ రావు కాలనీలో ఓ యువకుడు ఆదివారం ఇంటిలో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందాడు.
తాడేపల్లి టౌన్, నవంబరు 29: తాడేపల్లి పట్టణ పరిధిలోని కేఎల్ రావు కాలనీలో ఓ యువకుడు ఆదివారం ఇంటిలో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా, కొనగానమిట్ట మండలం, పెదరిగట్ల గ్రామానికి చెందిన కొమర వంశీ(21) మూడు నెలల క్రితం ఊరు నుంచి వచ్చి తన అన్నయ్య ఇంటిలో ఉంటున్నాడు. హార్డువేర్ షాపులో పనిచేసే వంశీ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి అన్నయ్య నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రేమ విఫలం కారణంగా వంశీ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. తాడేపల్లి ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.