ఠాణా వద్ద ధర్నాచేసిన వైసీపీ శ్రేణులపై కేసు
ABN , First Publish Date - 2020-05-28T11:48:03+05:30 IST
అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ట్ర్టాకర్లను విడిచిపెట్టలేదని, అంతేగాక పెద్ద మనిషి శివయ్యను పోలీసులు తూల నాడారని
తుళ్లూరు, మే 27: అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ట్ర్టాకర్లను విడిచిపెట్టలేదని, అంతేగాక పెద్ద మనిషి శివయ్యను పోలీసులు తూల నాడారని వైసీపీకి చెందిన కొంతమంది మంగళవారం అర్ధరాత్రి తుళ్లూరు పోలీసుస్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. లాక్ డౌన్ ఉల్లంఘన, విధులకు ఆటకపరచటం వంటి సెక్షన్లు 188, 341, 353, 448 విత్ 149 ఐపీసీ కింద సందీప్, శివయ్య, సురేంద్ర, నరేంద్ర సీతారామయ్య రామకృష్ణ మరికొంత మంది కేసు నమోదుచేశారు.