రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2020-09-27T10:16:56+05:30 IST
: మండలంలోని కనమర్లపూడి గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది.
కనమర్లపూడి(శావల్యాపురం)సెప్టెంబర్25: మండలంలోని కనమర్లపూడి గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఎస్ఐ కత్తి స్వర్ణలత తెలిపిన వివరాల ప్రకారం.. నల్లపాడుకు చెందిన షేక్ బాచి(30), షేక్ చందాని(28), సందీప్ కర్నూలు నుంచి షిప్ట్ డిజైర్ వాహనంలో స్వగ్రామం నల్లపాడుకు వెళుతుండగా కనమర్లపూడి సమీపంలో గుంటూరు వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో బాచి, చందాని అక్కడికక్కడే మృతి చెందారు. సందీప్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వర్ణలత తెలిపారు.