బాలుకి భారతరత్న ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-09-27T10:17:36+05:30 IST

గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న అవార్డు ఇవ్వాలని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ కోరారు. బాలు మృతికి

బాలుకి భారతరత్న ఇవ్వాలి

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌


తుళ్లూరు, సెప్టెంబరు: 26: గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న అవార్డు ఇవ్వాలని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ కోరారు. బాలు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ శనివారం ఎంపీ నందిగం ఓ ప్రకటన విడుదల చేశారు. అంతిమ సంస్కారం జరిగింది ఆయన శరీరానికి కానీ, ఆయన పాడిన పాటలకు కాదన్నారు. తెలుగు రాష్ట్రాల సినిమా పెద్దలంతా సమష్టిగా నిర్ణయం తీసుకొని హైద్రాబాద్‌ ఫిలిం చాంబర్‌ ఎదుట బాలసుబ్రమణ్యం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో బాలు స్మృతికి చిహ్నంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టే దిశగా సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళతానని నందిగం సురేష్‌ తెలిపారు.  

Updated Date - 2020-09-27T10:17:36+05:30 IST