సాగు చట్టాలు రైతులకు ఉరితాళ్లు

ABN , First Publish Date - 2020-12-19T05:44:20+05:30 IST

దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్న నూతన సాగు చట్టాలపై ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు.

సాగు చట్టాలు రైతులకు ఉరితాళ్లు
దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న కేసన శంకరరావు

 ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన 


గుంటూరు, డిసెంబరు 18: దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్న నూతన సాగు చట్టాలపై ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్ళను తలపిస్తున్నాయని ధ్వజమెత్తారు. యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, సంఘం నాయకులు పరసా రంగనాఽథ్‌, ఉప్పుటూరి పేరయ్య, తురకా రమేష్‌, జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-19T05:44:20+05:30 IST