-
-
Home » Andhra Pradesh » Guntur » barrage
-
బ్యారేజి దిగువకు 5,000 క్యూసెక్కులు
ABN , First Publish Date - 2020-11-22T04:17:15+05:30 IST
ఎగువ జలాశయాల నుంచి వరద ఉధృతి తగ్గడంతో ప్రకాశం బ్యారేజి వద్ద నీటి విడుదల స్వల్పంగా కొనసాగుతోంది.

తాడేపల్లి టౌన్, నవంబరు 21: ఎగువ జలాశయాల నుంచి వరద ఉధృతి తగ్గడంతో ప్రకాశం బ్యారేజి వద్ద నీటి విడుదల స్వల్పంగా కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి. పులిచింతల ప్రాజెక్టు, బ్యారేజి ఎగువన ఉన్న వివిధ వాగుల నుంచి 11,000 క్యూసెక్కుల వరదనీరు బ్యారేజి రిజర్వాయర్ వద్ద ఇన్ఫ్లోగా వచ్చి చేరింది. దిగువకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 6,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్ వద్ద 12 అడుగుల నీటి మట్టం కొనసాగిస్తూ మొత్తం 70 గేట్లలో 8 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు జేఈ దినేష్ తెలిపారు.
పశ్చిమ డెల్టాకు 5,936 క్యూసెక్కులు
దుగ్గిరాల, నవంబరు 21: ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు 5,936 క్యూసెక్కుల నీటిని శుక్రవారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజివద్ద నీటిమట్టం 12.0 అడుగులు ఉండగా దిగువకు 2,211 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దుగ్గిరాల సబ్డివిజన్ నుంచి హైలెవెల్ ఛానల్కు 240, రేపల్లె కాలువకు 301, తూర్పు కాలువకు 324, పశ్చిమ కాలువకు 100, నిజాంపట్నం కాలువకు 252, కొమ్మమూరు కాలువకు 1,760 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.