శాలివాహన నేత అరుణ్‌ప్రసాద్‌కు నివాళి

ABN , First Publish Date - 2020-12-05T05:31:54+05:30 IST

శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ అరుణ్‌ప్రసాద్‌ అకాల మరణం తీరని లోటని కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా, నగర నాయకులు తెలిపారు.

శాలివాహన నేత అరుణ్‌ప్రసాద్‌కు నివాళి
అరుణ్‌ప్రసాద్‌కి నివాళులర్పిస్తున్న శాలివాహన సంక్షేమ సంఘం నాయకులు

గుంటూరు, డిసెంబరు 4: శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ అరుణ్‌ప్రసాద్‌ అకాల మరణం తీరని లోటని కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా, నగర నాయకులు తెలిపారు. శుక్రవారం నగరంలో అరుణ్‌ప్రసాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోదుకూరు హరిబాబు, పారెళ్ల బసవేశ్వరరావు, నడికుడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-05T05:31:54+05:30 IST