రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2020-12-16T03:58:33+05:30 IST
దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులు వ్యతిరేకిస్తున్న రైతు చట్టాలను ఉప సంహరించుకోవాలని ఏపీ రైతుదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బూరుగ రత్నం డిమాండ్ చేశారు.
ఏపీ రైతు దళ్ రాష్ట్ర అధ్యక్షుడు బూరుగ రత్నం
గుంటూరు, డిసెంబరు 15: దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులు వ్యతిరేకిస్తున్న రైతు చట్టాలను ఉప సంహరించుకోవాలని ఏపీ రైతుదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బూరుగ రత్నం డిమాండ్ చేశారు. రైతు ఉద్యమానికి మద్దతుగా బ్రాడీపేటలోని మహిమా గార్డెన్స్లో మంగళవారం జరిగిన రైతు, రైతు కూలీల వ్యవసాయ కార్మిక పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18న గుంటూరులో నిరసన ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు చెరబండరాజు, ప్రత్యూష సుబ్బారావు, ఏఈఎల్సీ పీపీసీ జేఏసీ నాయకులు యోహాన్, చార్లెస్, నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు.