వైన్ షాపుల్లో మద్యం అపహరణ
ABN , First Publish Date - 2020-05-09T07:49:36+05:30 IST
మండలంలోని జగ్గడిగుంటపాలెం గ్రామంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులో
రూ.80 వేల విలువచేసే మద్యం చోరీ
తెనాలి రూరల్, అమృతలూరు, మే 8: మండలంలోని జగ్గడిగుంటపాలెం గ్రామంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపులో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. సుమారు రూ.80 వేలు విలువచేసే 111 మద్యం బాటిళ్లు, ఒక ట్యాబ్ అపహరించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు రూరల్ ఎస్ఐ మన్నెం మురళికృష్ణ, ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. అమృతలూరు మండలంలోని కూచిపూడి ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అర్ధరాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూపర్వైజర్పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ ఎస్ఐ వినీతరెడ్డి తెలిపారు.