కరోనా అనుమానితులు 56 మంది
ABN , First Publish Date - 2020-04-01T09:54:54+05:30 IST
ల్లాలో మూడో రోజు మంగళవారం కరోనా అనుమానితులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోటెత్తారు.

గుంటూరు(మెడికల్) మార్చి 31: జిల్లాలో మూడో రోజు మంగళవారం కరోనా అనుమానితులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోటెత్తారు. గుంటూరు జీజీహెచ్, కాటూరి, ఎన్నారై ఆసుపత్రులకు సుమారు 300 మంది రోగులు చికిత్స కోసం వచ్చారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం కరో నా లక్షణాలు ఉన్న సుమారు 56 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి నిర్థారణకు విజయవాడ ల్యాబ్కు పంపారు. రోజురోజుకు కరోనా అనుమానితులు పెరగటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.