రైలు ఢీకొని వృద్ధురాలి మృతి
ABN , First Publish Date - 2020-11-03T05:51:13+05:30 IST
రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. తొండంగి మండలం తొండంగి గ్రామానికి చెందిన సోమల నూకాలమ్మ(69)
తుని, సెప్టెంబరు 2: రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. తొండంగి మండలం తొండంగి గ్రామానికి చెందిన సోమల నూకాలమ్మ(69) సోమవారం తుని పట్టణంలో నాగరాజుపేట రైల్వే గేటు వద్ద పట్టాలు దాటుతుండగా రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న గుర్తుతెలియని రైలు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే ఎస్ఐ షేక్ అబ్దుల్మారూప్ కేసు నమోదుచేశారు.