షెల్టర్లు ఏమైనట్టో!

ABN , First Publish Date - 2020-04-28T09:26:23+05:30 IST

రాజమహేంద్రవరంలో నిరాశ్రయులు పెరిగారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలనే నిబంధనతో వలస

షెల్టర్లు ఏమైనట్టో!

రోడ్ల మీదే నిరాశ్రయులు 

రాజమహేంద్రవరంలో ఎక్కడ చూసినా వారే


రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో నిరాశ్రయులు పెరిగారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలనే నిబంధనతో వలస కార్మికులు, బిచ్చగాళ్లు, సాధువుల కోసం నగరంలో నాలుగు షెల్టర్లు ఏర్పాటు చేశారు. అక్కడ వారికి స్వచ్ఛంద సంస్థల వారు, దాతలు టిఫిన్‌, భోజనం స్నాక్స్‌ అందిస్తున్నారు. షెల్టర్లు ఉన్నప్పటికీ సుమారు 100 మంది వరకు రోడ్లమీద ఎవరైనా ఏదైనా సాయం చేస్తారేమోనని ఎదురు చూడడం గమనార్హం.


మొదట మెయిన్‌ రైల్వే స్టేషను వద్ద ఎక్కువ మంది కనిపించేవారు. రోజూ ఉదయం, సాయంకాలం రోడ్లమీదకు వచ్చి దాతలు ఇచ్చే అన్నం పొట్లాలు  తీసుకుని పోయేవారు. సోమవారం రైల్వేస్టేషన్‌, పుష్కర ఘాట్‌, గోదావరి గట్లు, మున్సిపల్‌ కార్యాలయం కాంప్లెక్స్‌ అరుగుల మీద అధిక సంఖ్యలో నిరాశ్రయులు ఉండడం గమనార్హం.  రైల్వేస్టేషన్‌ వద్ద బిచ్చగాళ్లు కొంతమందిని సోమవారం పోలీసులు షెల్టర్‌కు తరలించే ప్రయత్నం చేశారు. మిగతావారి గురించి ఎవరూ పట్టించుకోలేదు. 

Updated Date - 2020-04-28T09:26:23+05:30 IST