ఏలేరు ఆధునికీకరణ నిధులు ఏమయ్యాయి: వర్మ

ABN , First Publish Date - 2020-09-17T11:40:56+05:30 IST

పిఠాపురం నియోజకవర్గానికి వరద ముంపు నుంచి శాశ్వతంగా రక్షణ కల్పించేందుకు టీడీపీ హయాంలో మంజూరు చేయించిన ఏలేరు ఫేజ్‌-2 (ఏలేరు, సుద్దగడ్డ) ఆధునీకరణ నిధులు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ప్రశ్నించారు.

ఏలేరు ఆధునికీకరణ నిధులు ఏమయ్యాయి: వర్మ


గొల్లప్రోలు రూరల్‌/పిఠాపురం రూరల్‌: పిఠాపురం నియోజకవర్గానికి వరద ముంపు నుంచి శాశ్వతంగా రక్షణ కల్పించేందుకు టీడీపీ హయాంలో మంజూరు చేయించిన ఏలేరు ఫేజ్‌-2 (ఏలేరు, సుద్దగడ్డ) ఆధునీకరణ నిధులు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ప్రశ్నించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, ఏకేమల్లవరం, ఏపీ మల్లవరం, పిఠాపురం మండలంలోని గ్రామాల్లో ఏలేరు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని పంటపొలాలను ఆయన పరిశీలించారు. పిఠాపురం మండలం గోకివాడలోని అక్కిరెడ్డివారి చెరువులో ఇళ్లస్థలాల చదును కోసమని చెప్పి గ్రావెల్‌ తవ్వకాల కోసం చెరువుకు గండి కొట్టారని, దాని వల్లే పొలాలు ముంపునకు గురయ్యాయని రైతులు తనకు చెప్పారని వర్మ తెలిపారు.

 

గొల్లప్రోలు రూరల్‌/పిఠాపురం రూరల్‌: పిఠాపురం నియోజకవర్గానికి వరద ముంపు నుంచి శాశ్వతంగా రక్షణ కల్పించేందుకు టీడీపీ హయాంలో మంజూరు చేయించిన ఏలేరు ఫేజ్‌-2 (ఏలేరు, సుద్దగడ్డ) ఆధునీకరణ నిధులు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ప్రశ్నించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, ఏకేమల్లవరం, ఏపీ మల్లవరం, పిఠాపురం మండలంలోని గ్రామాల్లో ఏలేరు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని పంటపొలాలను ఆయన పరిశీలించారు.


పిఠాపురం మండలం గోకివాడలోని అక్కిరెడ్డివారి చెరువులో ఇళ్లస్థలాల చదును కోసమని చెప్పి గ్రావెల్‌ తవ్వకాల కోసం చెరువుకు గండి కొట్టారని, దాని వల్లే పొలాలు ముంపునకు గురయ్యాయని రైతులు తనకు చెప్పారని వర్మ తెలిపారు. 

Updated Date - 2020-09-17T11:40:56+05:30 IST