మహాత్ముడు మహోన్నత శిఖరం: వనమాడి
ABN , First Publish Date - 2020-10-03T06:20:17+05:30 IST
మానవాళి చరిత్రలో గాంధీ మహాత్ముడు ఒక మహోన్నత శిఖరమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి

డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), అక్టోబరు 2: మానవాళి చరిత్రలో గాంధీ మహాత్ముడు ఒక మహోన్నత శిఖరమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మందాల గంగసూర్యనారాయణ, చింతలపూడి కాశి, డొక్కా నాథ్బాబు, ఎంఏ తాజుద్దీన్, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, వొమ్మి బాలాజీ, చింతలపూడి రవి, రహీమ్, బొడ్డు రాజు, గాది శివరామకృష్ణ, మూగు రాజు పాల్గొన్నారు.