టిడ్కో ఇళ్లు ఎందుకివ్వలేదు
ABN , First Publish Date - 2020-12-29T07:00:52+05:30 IST
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 28: రాష్ట్రంలో ఈనెల 25న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎందుకు ఇంకా ఇవ్వలేదో చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కట్టిన ఇళ్లను లబ్ధిదారుల
మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 28: రాష్ట్రంలో ఈనెల 25న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎందుకు ఇంకా ఇవ్వలేదో చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇంకా ఇవ్వకుండా కాలయాపన చేయడం దారుణమన్నారు. ఇప్పటికే లబ్ధిదారులు ఆయా ఇళ్ల కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. కనీసం ఇళ్లలోకి వెళ్తేనైనా సొంత ఇంటిలోకి వచ్చామన్న కొంత ఊరట ఉంటుందని, అయితే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న గంటకో నిర్ణయాల వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల సేకరణలో రూ.500 కోట్లు అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో స్థల సేకరణకు రూ.4వేల కోట్లు, చదునుకు రూ.2వేలకోట్లు నాయకులు, ఇతరులకు లబ్ధి చేకూర్చేందుకు కలిపి మొత్తం దోచుకున్నారని విమర్శించారు. ఆవ భూములపై సీబీఐ విచారణ పడినా ఇంకా వైసీపీ నాయకులకు సిగ్గులేదని ఆదిరెడ్డి మండిపడ్డారు.