డిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-20T06:55:21+05:30 IST
జాతీయ రహదారిపై కోరింగ వంతెన వద్ద శనివారం టిప్పర్ ఢీకొనడంతో వాసంశెట్టి సత్యనారాయణ(46) మృతి చెందాడు. కె.గంగవరం మండలం, మసకపల్లి గ్రామానికి చెందిన వాసంశెట్టి సత్యనారాయణ తెల్లవారుజామున మోటారుసైకిల్పై కాకినాడ వెళుతుండగా కోరింగ వంతెన వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టింది.

తాళ్లరేవు, డిసెంబరు 19: జాతీయ రహదారిపై కోరింగ వంతెన వద్ద శనివారం టిప్పర్ ఢీకొనడంతో వాసంశెట్టి సత్యనారాయణ(46) మృతి చెందాడు. కె.గంగవరం మండలం, మసకపల్లి గ్రామానికి చెందిన వాసంశెట్టి సత్యనారాయణ తెల్లవారుజామున మోటారుసైకిల్పై కాకినాడ వెళుతుండగా కోరింగ వంతెన వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టింది. అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్ఐ వై.సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.