పాజిటివ్లు 975
ABN , First Publish Date - 2020-10-03T07:25:59+05:30 IST
జిల్లాలో కొవిడ్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య లక్షకు చేరువవు తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ట్రూనాట్ ద్వారా

జిల్లాలో 99,135కు చేరిన కేసులు
కొత్తగా కొవిడ్ వైరస్తో నలుగురు మృతి
కాకినాడ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య లక్షకు చేరువవు తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ట్రూనాట్ ద్వారా 490, రాపిడ్ కిట్లతో చేసిన పరీక్షల్లో 485 మందికి పాజిటివ్ రాగా, మొత్తం 975 మందికి వైరస్ సోకినట్టు నిర్ధార ణయ్యింది. దీంతో కేసులు 99,135కు చేరాయి. కొవిడ్తో చికిత్స పొందుతూ కొత్తగా నలుగురు మృతి చెందడంతో 532 మరణాలు నమోదయ్యాయి. 9,323 మంది యాక్టివ్ కేసులుండగా, 89,280 మంది చికిత్సపొంది కోలుకున్నారు.