అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది
ABN , First Publish Date - 2020-10-03T07:14:12+05:30 IST
పేదలను అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపించేందుకు వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

రావులపాలెంరూరల్, అక్టోబరు 2: పేదలను అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపించేందుకు వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. పొడగట్లపల్లిలో రూ.40లక్షలతో నిర్మించనున్న తదితర పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, తహసీల్దార్ జిలానీ, ఈవోపీఆర్డీ కృష్ణ, ఏవో మీనా, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.