కేంద్రం ఎగ్జిట్ పాలసీని ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-05-11T09:57:13+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎగ్జిట్
![కేంద్రం ఎగ్జిట్ పాలసీని ప్రకటించాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు
అమలాపురం, మే 10(ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎగ్జిట్ పాలసీని ప్రకటించాలని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. రైతులు, చేనేత, వివిధ రకాల వృత్తి పనివారలు, చిన్న, మధ్యతరహా పరిశ్ర మల్లో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవాలన్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ నిర్వహించి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కల్వకొలను తాతాజీ, కొత్తూరి శ్రీనివాస్, చీకట్ల అబ్బాయి, అయితాబత్తుల సుభాషిణి, వంటెద్దు బాబి, షకీలా పాల్గొన్నారు.