కరోనాతో ఉపాధ్యాయుడి మృతి
ABN , First Publish Date - 2020-10-03T06:39:36+05:30 IST
మండలంలోని మొల్లేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెలుగుల కృష్ణారెడ్డి కరోనాతో మృతిచెందారు.

గంగవరం, అక్టోబరు 2: మండలంలోని మొల్లేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెలుగుల కృష్ణారెడ్డి కరోనాతో మృతిచెందారు. ఆయన మృతి పట్ల ఎంఈవో మల్లేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణ, కమిటీ మండలాధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.