భూసార పరీక్షలతో సుస్థిర దిగుబడులు
ABN , First Publish Date - 2020-06-26T10:34:43+05:30 IST
రైతులు సాగుచేసే నేలల్లో భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ద్వారా ఎరువుల వాడకంలో దుబారా ఖర్చులు చేయకుండా సుస్థిర దిగుబడులు
![భూసార పరీక్షలతో సుస్థిర దిగుబడులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సామర్లకోట, జూన్ 25: రైతులు సాగుచేసే నేలల్లో భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ద్వారా ఎరువుల వాడకంలో దుబారా ఖర్చులు చేయకుండా సుస్థిర దిగుబడులు పొందవచ్చని జిల్లా భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారిణి ఎన్.ప్రశాంతి పేర్కొన్నారు. ఉండూరు లోని గ్రామ రైతు భరోసా కేంద్రంలో గురువారం సాయంత్రం భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహనా సదస్సు మండల వ్యవసాయాధికారిణి ఐ.సత్య అధ్యక్షతన జరిగింది.