పాఠశాలలోనే ఉరేసుకున్న ఉపాధ్యాయుడు
ABN , First Publish Date - 2020-12-13T05:46:08+05:30 IST
అప్పుల బాధలు తాళలేక ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. అన్నపూర్ణంపేటకు చెందిన సుబ్బారావు (48) రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని నన్నయ్య హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు.

రాజమహేంద్రవరం సిటీ జూలై 12: అప్పుల బాధలు తాళలేక ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. అన్నపూర్ణంపేటకు చెందిన సుబ్బారావు (48) రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని నన్నయ్య హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో తన సహచర ఉద్యోగికి ఒక లోన్ విషయంలో ష్యూరిటీ సంతకం చేశారు. కొంతకాలం డబ్బులు కట్టిన అనంతరం ఆ వ్యక్తి ఉద్యోగం వదిలి అదృశ్యమయ్యాడు. దీంతో రుణం తీర్చే బాధ్యత సుబ్బారావు నెత్తిన పడింది. దీనికి తోడు బయట కూడా అప్పులు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. వచ్చే జీతం అప్పులకు సరిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో రెండో శనివారం సెలవు దినం అయినప్పటికీ పాఠశాలకు వచ్చిన సుబ్బారావు పై అంతస్తులో తాడుతో ఫ్యాను ఉక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కింద నాడు-నేడు పనులు చేస్తున్న సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మోసం చేసిన సహచర ఉద్యోగి, డబ్బుల కోసం ఇబ్బందులు పెట్టిన వారు ఎవరనే దానిపై విచారణ చేపట్టారు.