భార్య కాపురానికి రావడం లేదని
ABN , First Publish Date - 2020-12-01T06:14:33+05:30 IST
పిఠాపురంలో జగ్గయ్యచెరువుకు చెందిన యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దూలపల్లి శ్రీను (28) అనే యువకుడు భార్య కాపురానికి రాలేదనే మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

యువకుడి ఆత్మహత్య
పిఠాపురం, నవంబరు 30: పిఠాపురంలో జగ్గయ్యచెరువుకు చెందిన యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దూలపల్లి శ్రీను (28) అనే యువకుడు భార్య కాపురానికి రాలేదనే మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సామర్లకోట రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పెద్దాపురం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ రాజు తెలిపారు.