హక్కుల పరిరక్షణకు చర్యలు
ABN , First Publish Date - 2020-12-11T06:01:13+05:30 IST
మానవ హక్కుల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు.
కాకినాడ క్రైం, డిసెంబరు 10: మానవ హక్కుల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ పాల్గొని మానవ హక్కుల పరిరక్షణ కోసం జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై డీజీపీకి వివరించారు. ప్రతి పోలీసుస్టేషన్లో ఓ అధికారిని ఉంచి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతీ పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, నిందితుల అరెస్ట్ సమయంలో సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు. ఎస్బీ డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్, ఇన్స్పెక్టర్ కె.రజనీకుమార్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ పాల్గొన్నారు.