సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
ABN , First Publish Date - 2020-06-26T10:35:12+05:30 IST
విధుల నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శించిన పిఠాపురం 5వ వార్డు సచివాలయంలోని పది మంది ఉద్యోగులకు జిల్లా జాయింట్ కలెక్టరు (సచివాలయం)
![సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పిఠాపురం, జూన్ 25: విధుల నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శించిన పిఠాపురం 5వ వార్డు సచివాలయంలోని పది మంది ఉద్యోగులకు జిల్లా జాయింట్ కలెక్టరు (సచివాలయం) సీహెచ్.కీర్తి గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులు నిర్వర్తించకుండా పార్టీలు చేసుకోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని జేసీ ఆదేశించారు.