ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్య పనులు
ABN , First Publish Date - 2020-10-03T06:12:08+05:30 IST
ప్రజల భాగస్వామ్యంతో స్థిరమైన పద్ధతిలో పారిశుధ్య కార్యకలాపాలు నిర్వహించవచ్చని రూరల్ తహశీల్దార్ మురళీకృష్ణ తెలిపారు. కాకినాడ
కాకినాడ రూరల్, అక్టోబరు 2: ప్రజల భాగస్వామ్యంతో స్థిరమైన పద్ధతిలో పారిశుధ్య కార్యకలాపాలు నిర్వహించవచ్చని రూరల్ తహశీల్దార్ మురళీకృష్ణ తెలిపారు. కాకినాడ రూరల్ చీడిగ, గంగనాపల్లి, కొవ్వాడ, తూరంగి, రేపూరు, కొవ్వూరు, ఇంద్రపాలెం గ్రామాల్లో శుక్రవారం పంచాయతీల కార్యదర్శులు గోవిందరాజులు, సత్యనారాయణ, శివప్రసాద్, నరసింహారావు అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. గంగనాపల్లి సభలో ప్రత్యేకాధికారి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ కేకేఎన్ కుమార్, చీడిగ సభలో ప్రత్యేకాధికారి, తహశీల్దార్ మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పారిశుధ్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లను సత్కరించారు. మనం-మన పరిశుభ్రతపై ర్యాలీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు గీసాల శ్రీనివాసరావు, పాండ్రంకి రాజు, కొప్పిశెట్టి గణేష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.