పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలి

ABN , First Publish Date - 2020-10-01T07:47:19+05:30 IST

పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలని డీఎల్‌పీవో సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆయన

పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలి

డీఎల్‌పీవో సత్యనారాయణ 


సీతానగరం, సెప్టెంబరు 30: పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలని డీఎల్‌పీవో సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆయన సీతానగరం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని పంచాయతీల్లో పారిశుధ్య అసలు బాగోలేదని పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టిసారించాలని సూచించారు.


మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా గతంలో పైలెట్‌ ప్రాజక్టులుగా సీతానగరం, బొబ్బిల్లంక ఎంపిక చేయగా ప్రస్తుతం వంగలపూడి, నాగంపల్లి, సింగవరం, మిర్తిపాడు, ఇనుగంటివారిపేట గ్రామాలను ఎంపిక చేశారని ఆయన తెలిపారు. రఘుదేవపురం పంచాయతీ స్థలాన్ని పరిశీలించి వెంటనే భవన నిర్మాణ కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. ఈవోపీఆర్డీ మహేశ్వర ప్రతాప్‌, పంచాయతీ కార్యదర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.


 

Updated Date - 2020-10-01T07:47:19+05:30 IST