జాతీయ పద్య కవితల పోటీలో తాతా సందీప్కు ద్వితీయ బహుమతి
ABN , First Publish Date - 2020-10-02T08:53:12+05:30 IST
బెంగళూరుకు చెందిన సీపీ బ్రౌను సమితి నిర్వహించిన జాతీయ పద్య కవితల పోటీలో రాజమహేంద్రవరానికి ..
గోదావరి సిటీ, అక్టోబరు 1: బెంగళూరుకు చెందిన సీపీ బ్రౌను సమితి నిర్వహించిన జాతీయ పద్య కవితల పోటీలో రాజమహేంద్రవరానికి చెందిన అష్టావధాని తాతా సందీప్ శర్మ ద్వితీయ స్థానంలో నిలిచాడు. వలస కార్మికుల కష్టాలు అంశంపై ఆయన పద్యాలు రాశారు. ద్వితీయ బహుమతిగా రూ.2వేల నగదు బహుమతి అందుకోనున్నారు.