37 రీచ్ల్లో 17లక్షల క్యూ.మీటర్ల ఇసుక గుర్తింపు
ABN , First Publish Date - 2020-10-23T08:24:15+05:30 IST
జిల్లాలో 37 ఇసుకరీచ్ల్లో 17లక్షల4వేల800 క్యూబిక్ మీటర్ల ఇసుకను జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ గుర్తించిందని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు.
- జిల్లాస్థాయి శాండ్ కమిటీ సమావేశం కలెక్టర్
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), అక్టోబరు 22: జిల్లాలో 37 ఇసుకరీచ్ల్లో 17లక్షల4వేల800 క్యూబిక్ మీటర్ల ఇసుకను జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ గుర్తించిందని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు. కలెక్టరేట్నుంచి డిసి్ట్రక్ట్ లెవెల్ శాండ్ కమిటీ సమావేశం గురువారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుర్తించిన రీచ్లకు సంబంధించి పర్యావరణపరమైన అనుమతులకు పంపామన్నారు. జిల్లాలో ఇసుక రవాణాలో ఇబ్బందులు లేకుండా సజావుగా సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో జేసీ జి.లక్ష్మీశ, అడిషనల్ ఎస్పీ అమిత్గార్గ్తోపాటు మైనింగ్ ఏడీ వీఆర్ కుమార్ పాల్గొన్నారు.