క్షేమంగా చిన్నారులు
ABN , First Publish Date - 2020-10-07T10:24:59+05:30 IST
ఇటీవల కలుషిత తినుబండారాలు తిని అస్వస్థతకు గురైన చిన్నారులు క్షేమం గా ఉన్నారని అంగన్వాడీ ప్రాజెక్టు అధికారి శంశాద్ బేగమ్ తెలిపారు...
వరరామచంద్రాపురం, అక్టోబరు 6: ఇటీవల కలుషిత తినుబండారాలు తిని అస్వస్థతకు గురైన చిన్నారులు క్షేమం గా ఉన్నారని అంగన్వాడీ ప్రాజెక్టు అధికారి శంశాద్ బేగమ్ తెలిపారు. పిల్లలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు అందించారు. తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.