తగ్గిన ఏలేరు వరద ఉధృతి
ABN , First Publish Date - 2020-10-01T07:12:04+05:30 IST
ఏలేరు వరద ఉధృతి మరింతగా తగ్గింది. బుధవారం సాయంత్రానికి కాలువల్లో నీటిమట్టం సాధారణ
పిఠాపురం/గొల్లప్రోలు, సెప్టెంబరు 30: ఏలేరు వరద ఉధృతి మరింతగా తగ్గింది. బుధవారం సాయంత్రానికి కాలువల్లో నీటిమట్టం సాధారణ స్థాయికి చేరుకోవడం ప్రారంభించింది. పిఠాపురం, గొల్లప్రోలు పరిసరాల్లో పలుచోట్ల గండ్లునుంచి నీరు ఇంకా పొలాల మీదుగా ప్రవహిస్తున్నది.
ముంపు తగ్గడంతో నష్టాలు బయటపడుతున్నాయి. 10వేల ఎకరాలకు పైగా వరిపంట పూర్తిగా దెబ్బతిన్నది. 18 రోజులపాటు ముంపు కొనసాగడంతో పంట పనికి రాకపోగా కుళ్లిపోయి వాసన వస్తోంది.